మరో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు.! దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా...

  Sun Mar 30, 2025 12:02        Entertainment

ఇటీవల మయన్మార్‌(Myanmar)ను వణికించిన భూకంపం(Earthquake) తాజాగా ఇండోనేషియా(Indonesia)ను కుదిపేసింది. ఇవాళ(ఆదివారం) ఉదయం ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. సుమత్రా దీవుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మయన్మార్‌ భూకంపం గురించి టీవీలు, వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న ఇండోనేషియా వాసులు భయంతో వణికిపోతున్నారు. అక్కడి భూవిలయంలో సుమారు 700 మంది మృతిచెందగా.. 1670 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో తమకూ అలాంటి పరిస్థితి ఎదురవుతుందనే భయం వీరిని పట్టుకుంది. కాగా, గతంలోనూ పలు భూకంపాలు లక్షల మంది ఇండినేషియా వాసుల ప్రాణాలు తీశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న సైతం ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

 

ఇది కూడా చదవండి: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం! కొత్త కార్యక్రమాలకు శ్రీకారం..

 

సులవేసీ ద్వీప తీరానికి కొంత దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. అయితే ప్రాణ, ఆస్తి నష్టం ఏమీ సంభవించలేదు. అలాగే 2021లోనూ సులవేసీలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల ఇళ్లు నేలమట్టం అయ్యి లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. సులవేసీలో 2018లో 7.1 తీవ్రతతో మరో భూకంపం వచ్చి ఏకంగా 2,200 మంది ప్రాణాలు బలి తీసుకుంది. అలాగే మానవ సమాజం ఎన్నటికీ మర్చిపొలేని 2004 నాటి భూకంపం ఏకంగా సునామీకి దారి తీసింది. అసీ ప్రావిన్స్‌లో 7.1 తీవ్రతతో భూకంపం రాగా.. తదనంతరం సునామీ ఏర్పడి ఏకంగా 1.7 లక్షల మంది ప్రాణాలు తీసేసింది. భూ ఫలకాలు నిత్యం ఢీకొనే ప్రాంతంలో ఇండోనేషియా ఉన్న కారణంగా తరచుగా ఇక్కడ భూకంపాలు ఏర్పడుతుంటాయి. అందుకే ఈ ప్రాంతానికి శాస్త్రవేత్తలు రింగ్ ఆఫ్ ఫైర్‌ అనే పేరు పెట్టారు. అలాగే ఇక్కడ అనేక అగ్ని పర్వాతాలూ ఉండటం భూకంపాలకు మరో కారణంగా చెప్తుంటారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ లో నామినేటెడ్ పదవుల జాతర! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!

 

ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

 

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting